ఏపీలో 2,561కి చేరిన కరోనా నిర్ధారిత కేసులు

  • గత 24 గంటల్లో 9,136 శాంపిళ్ల పరీక్ష
  • మరో 47 మందికి కరోనా
  • ఆసుపత్రుల్లో 727 మందికి చికిత్స
  • కృష్ణాజిల్లాలో మరొకరు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు నిర్వహిస్తోన్న కొద్దీ కరోనా వైరస్ కేసులు భారీగా బయటపడుతున్నాయి. గత 24 గంటల్లో 9,136 శాంపిళ్లను పరీక్షించగా మరో 47 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 47 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,561 అని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 727 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,778 మంది డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కృష్ణాజిల్లాలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మొత్తం 56కి చేరింది.


Corona Virus
COVID-19
Andhra Pradesh

More Telugu News