ఆ కార్యక్రమానికి ‘జగన్ కిల్డ్ ఏపీ’ అని పేరు పెట్టుంటే బాగుండేది: నారా లోకేశ్

  • ఏపీ సీఎం జగన్ పై లోకేశ్ తీవ్ర విమర్శలు
  • రాష్ట్రంలో ఆస్తుల‌న్నీ అమ్మేసి ఏపీని చంపేస్తున్నారు
  • ఆ కార్యక్రమానికి 'మిషన్ బిల్డ్ ఏపీ'  అని జగన్ పేరు పెట్టారు 
ఏపీలో ప్రభుత్వ భూములను నేషనల్ బిల్డింగ్ అండ్ కన్ స్ట్రక్షన్ సంస్థ ద్వారా అమ్మకానికి పెట్టి వాటిని అభివృద్ధి చేసి ఔత్సాహికులకు విక్రయించే ఉద్దేశంతో ‘మిషన్ బిల్డ్ ఏపీ’ కార్యక్రమాన్ని సీఎం జగన్ ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ విషయమై టీడీపీ నేత నారా లోకేశ్ తాజాగా విమర్శలు సంధించారు. ‘తల్లిదండ్రుల గొంతు కోసి చంపిన  ఉన్మాది కొడుకు త‌రువాత వారికి పెద్ద గుడి కట్టిస్తానని ప్రకటించాడట. ఉన్మాది కొడుకులాగే రాష్ట్రంలో ఆస్తుల‌న్నీ అమ్మేసి ఏపీని చంపేస్తూ దానికి 'మిషన్ బిల్డ్ ఏపీ' ’ అని పేరు పెట్టారని, ఆ పేరుకు బదులు 'జగన్ కిల్డ్ ఏపీ' అని పేరు పెట్టుంటే బాగుండేదంటూ తీవ్ర విమర్శలు చేశారు.

Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
Mission Build AP

More Telugu News