మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కరోనా టెస్టులు నిర్వహించిన వైద్యులు

  • ఛాతీనొప్పితో ఆసుపత్రిలో చేరిన మన్మోహన్
  • కొత్తమందులు వాడడంతో మాజీ ప్రధానికి జ్వరం
  • కరోనా టెస్టులు నిర్వహించగా నెగెటివ్ వచ్చిన వైనం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (87) ఛాతీ నొప్పితో ఆదివారం సాయంత్రం ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారని వైద్య వర్గాలు తెలిపాయి. అయితే వైద్య చికిత్సలో భాగంగా కొన్ని కొత్త మందులు ఇవ్వడంతో మన్మోహన్ కు జ్వరం వచ్చింది.

దాంతో ముందు జాగ్రత్తగా మన్మోహన్ సింగ్ కు కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఎయిమ్స్ లోని కార్డియో థొరాసిక్ సైన్సెస్ సెంటర్ వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. మన్మోహన్ కు ఇవాళ జ్వరం రాలేదని, క్రమంగా కోలుకుంటున్నారని ఆయన సన్నిహితుడొకరు తెలిపారు.

Manmohan Singh
Aiims
Corona Virus
New Delhi
Congress

More Telugu News