ఏపీ ప్రభుత్వంపై మరోమారు విమర్శలు గుప్పించిన నారా లోకేశ్

  • సమస్యలు చెబుతున్న ప్రతిపక్షంపై ఎదురుదాడి  
  • మీడియాపైనా ఎదురుదాడికి పాల్పడుతున్నారు
  • వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శల పర్వం కొనసాగుతోంది. సమస్యలు చెబుతున్న ప్రతిపక్షంపై, అలాగే, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్న మీడియాపై ఎదురుదాడికి పాల్పడుతున్నారంటూ లోకేశ్ మండిపడ్డారు. వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయన్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలని అన్నారు. కాగా, పుచ్చకాయలు సాగు చేసే రైతుల కష్టాలకు సంబంధించి ఓ పత్రికలో వచ్చిన కథనంపై మంత్రి కన్నబాబు విమర్శలు చేశారు. దీనిపై లోకేశ్ విమర్శలు చేస్తూ ఓ వీడియోను జతపరిచారు.

Nara Lokesh
Telugudesam
Andhra Pradesh
Minister
Kannababu

More Telugu News