కొత్తగా మరో 1,684 పాజిటివ్ కేసులు.. కరోనా లేటెస్ట్ అప్ డేట్స్!

  • అంతకంతకూ విస్తరిస్తున్న కరోనా మహమ్మారి
  • గత 24 గంటల్లో 37 మంది మృతి
  • 23 వేలు దాటిన మొత్తం కేసుల సంఖ్య
ఇండియాలో కరోనా ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతుండటం కలవరపెడుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,684 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 37 మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదే సమయంలో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 23 వేలు దాటింది. మొత్తం కేసుల సంఖ్య 23,077కు చేరుకుంది. మొత్తం మరణాల సంఖ్య 718కి పెరిగింది. యాక్టివ్ కేసులు 17,610కి పెరిగాయి. 4,749 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

Corona Virus
India
Updates

More Telugu News