కరోనా ‘ధనవంతుల వ్యాధి’.. వారే దానిని తీసుకొచ్చారు: పళనిస్వామి సంచలన వ్యాఖ్యలు

  • ఈ వైరస్ ధనవంతులకే ఎక్కువగా సోకుతోంది
  •  ఇదేమీ రాష్ట్రంలో పుట్టలేదు
  • రాష్ట్రంలో నిన్న కొత్తగా 25 కేసుల నమోదు
ప్రపంచాన్ని భయభ్రాంతుల్లోకి నెట్టేసిన కరోనా వైరస్‌‌ను తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ‘ధనవంతుల వ్యాధి’గా అభివర్ణించారు. ధనవంతులే దానిని రాష్ట్రంలోకి తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. ఈ వైరస్ ఎక్కువగా ధనవంతులకే సోకుతోందని, విదేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన వారి ద్వారానే వైరస్ రాష్ట్రంలోకి దిగుమతి అయిందని అన్నారు. ఈ ప్రాణాంతక వైరస్ రాష్ట్రంలో పుట్టినది కాదన్నారు. ఈ వైరస్ నివారణ సవాలుతో కూడుకున్నదని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో వైరస్ మరింత విస్తరించకుండా విజయవంతంగా అడ్డుకోగలిగామని పళనిస్వామి చెప్పారు.

కాగా, తమిళనాడులో నిన్న కొత్తగా 25 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1267కు పెరిగింది. అలాగే, ఈ వైరస్ బారినపడి ఒకరు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 15కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 180 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, ఇంకా 1072 యాక్టివ్ కేసులు ఉన్నాయని పళనిస్వామి వివరించారు.

Tamil Nadu
Palanisamy
Disease of rich
Corona Virus

More Telugu News