ఏపీలో 420కి పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

  • కొత్తగా రాష్ట్రంలో 15 కేసులు
  • గుంటూరు జిల్లాలో తాజాగా ఏడుగురికి కరోనా పాజిటివ్
  • అత్యధికంగా కర్నూలు జిల్లాలో మొత్తం 84 కేసులు
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు నిర్వహించిన పరీక్షల్లో 15 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 420కి చేరింది. గుంటూరు జిల్లాలో 7, నెల్లూరు జిల్లాలో 4, కర్నూలు జిల్లాలో 2, కడప జిల్లాలో  1, చిత్తూరు జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి.

ఇక రాష్ట్రంలో మరో మరణం నమోదైంది. దాంతో ఇప్పటివరకు కరోనాతో ఏడుగురు మరణించారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 84 కేసులు వెల్లడి కాగా, గుంటూరు జిల్లా 82 కేసులతో రెండో స్థానంలో ఉంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కరోనా రహిత జిల్లాలుగా కొనసాగుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లో కరోనా కేసులేమీ లేవు.

Andhra Pradesh
Corona Virus
Positive
Deaths
Guntur District
Kurnool District

More Telugu News