గుంటూరు జిల్లా ఎమ్మెల్యే ఐసోలేషన్ కు తరలింపు

  • ఇటీవలే ఢిల్లీకి వెళ్లొచ్చిన ఎమ్మెల్యే బావమరిది
  • బావమరిది, ఆయన భార్యకు కరోనా పాజిటివ్
  • ఆయన ఇచ్చిన పార్టీకి హాజరైన ఎమ్మెల్యే
కరోనా సోకిందేమో అనే అనుమానాలతో గుంటూరు జిల్లాలోని ఓ ఎమ్మెల్యేను అధికారులు ఐసోలేషన్ కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే ఎమ్మెల్యే బావమరిది, ఆయన భార్య ఇటీవలే ఢిల్లీకి వెళ్లొచ్చారు. వీరిద్దరికీ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. అయితే ఆయన ఇచ్చిన విందుకు ఎమ్మెల్యే  కూడా  హాజరయ్యారు. దీంతో, ఎమ్మెల్యేకు కూడా కరోనా సోకిందేమో అన్న అనుమానంతో ఐసోలేషన్ కు తరలించారు. గుంటూరు సమీపంలోని ఓ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ లో ఎమ్మెల్యేకు, ఆయన భార్యకు పరీక్షలు నిర్వహించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Andhra Pradesh
Guntur District
MLA
Corona Virus

More Telugu News