కరోనాపై ఆసక్తికర వీడియో పోస్టు చేసిన మహేశ్ బాబు

  • సామాజిక ఎడం పాటించాలన్న మహేశ్ బాబు
  • కష్టమైనా తప్పదని వెల్లడి
  • ఐకమత్యంగా పోరాడి కరోనాను తరిమికొడదామని పిలుపు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కరోనా వైరస్ మహమ్మారిని ఎలా నియంత్రించవచ్చో ఓ వీడియో సాయంతో వివరించారు. ఇప్పుడు కావాల్సింది ప్రజలు సామాజిక ఎడం పాటించడమేనని తెలిపారు. ఒకరితో ఒకరు కలవకుండా సాధ్యమైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నించాలని, ఇది కష్టసాధ్యమైన నిర్ణయమే అయినా పాటించకతప్పదని సూచించారు.

"ప్రజాహితం కోసం మన సామాజిక జీవనాన్ని త్యాగం చేయాల్సిన సమయం వచ్చింది. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువ సమయం ఇంటిపట్టునే ఉండడం ద్వారా ఈ దశను అధిగమిద్దాం. ఇలా చేయడం ద్వారా వైరస్ మరింత వ్యాపించకుండా చేసి, మరిన్ని ప్రాణాలను కాపాడిన వాళ్లమవుతాం.

పరిసరాలను శుభ్రంగా ఉంచండి, తరచుగా మీ చేతులను శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. వీలైనంతగా శానిటైజర్లను వినియోగించడం అలవర్చుకోండి. మీరు అస్వస్థతకు గురయ్యామని భావించినప్పుడే మాస్కు ధరించండి. ఇప్పుడు మనందరం కరోనాను తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిన స్థితిలో ఉన్నాం కాబట్టి అందరం కలసికట్టుగా పోరాడదాం... కరోనాను తరిమికొడదాం" అంటూ మహేశ్ బాబు పిలుపునిచ్చారు. అంతేకాదు, కరోనా వ్యాప్తిని ఎలా అరికట్టవచ్చో సోదాహరణంగా ఓ వీడియో రూపంలో చూపించారు.



Mahesh Babu
Corona Virus
Social Awareness
COVID-19

More Telugu News