ఒవైసీని దేశంలో పర్యటించకుండా ఆంక్షలు విధించాలి: కన్నా

  • సీఏఏ వ్యతిరేక సభలు నిర్వహిస్తున్న ఒవైసీ
  • ఒవైసీ మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న కన్నా
  • గుంటూరులో ఒవైసీ పర్యటనకు వైసీపీ ఎమ్మెల్యే నిధులిచ్చారని ఆరోపణ
సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఒవైసీ మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారని, ఒవైసీని దేశంలో పర్యటించకుండా ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. గుంటూరులో ఒవైసీ పర్యటనకు ఓ వైసీపీ ఎమ్మెల్యే నిధులు సమకూర్చారని కన్నా ఆరోపించారు. సీఏఏ వ్యతిరేక కార్యక్రమాల్లో వైసీపీ కూడా పాల్గొనడం సిగ్గుచేటని అన్నారు.

Kanna Lakshminarayana
Asaduddin Owaisi
Guntur
CAA
NRC
YSRCP

More Telugu News