చంద్రబాబుది మామూలు ‘గుండె’ కాదు: విజయసాయిరెడ్డి చురకలు

  • జారి పడుతూ కొమ్మను పట్టుకుని వేలాడుతున్న పరిస్థితి చంద్రబాబుది
  • ఏ క్షణంలోనైనా కొమ్మ విరగొచ్చు 
  • పట్టుతప్పి తనే అగాథంలోకి పడిపోవచ్చు
  • అంత నిస్సహాయతలోనూ ఒక్కొక్కరి భరతం పడతానంటున్నారు
విశాఖపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తోన్న నేపథ్యంలో ఆయనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన అందరినీ బెదిరిస్తున్నారని చెబుతూ ట్వీట్ చేశారు.
 
'కొండపై నుంచి జారిపడుతూ మధ్యలో కొమ్మను పట్టుకుని వేలాడుతున్న పరిస్థితి చంద్రబాబుది. ఏ క్షణంలోనైనా కొమ్మ విరగొచ్చు లేదా పట్టుతప్పి తనే అగాథంలోకి పడిపోవచ్చు. అంత నిస్సహాయతలో కూడా ‘ఒక్కొక్కరి భరతం పడతా, ఎవర్నీ వదిలి పెట్టేది లేదు’ అని బెదిరిస్తున్నాడంటే మామూలు ‘గుండె’ కాదు' అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

Vijay Sai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News