నువ్వు నెలనెలా బిచ్చమేస్తేనే ప్రజలు బతుకుతున్నారనుకుంటున్నావా బాబూ?: విజయసాయిరెడ్డి

  • వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు కట్టుకోవద్దట
  • కళ్లలో నిప్పులు పోసుకుంటున్నాడు 
  • ఎవడబ్బ సొమ్మని ఫ్లెక్సీలు కడతారని చించుకుంటున్నావు
  • 14 ఏళ్లు సీఎంగా చేసినోడివి ఇంతగా పతనమవుతావని అనుకోలేదు 
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ ఫ్లెక్సీలపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ తీరు సరికాదని చెబుతూ ట్వీట్ చేశారు.

'వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు కట్టుకోవద్దట. కళ్లలో నిప్పులు పోసుకుంటున్నాడు. నువ్వు నెలనెలా బిచ్చమేస్తేనే ప్రజలు బతుకుతున్నారనుకుంటున్నావా బాబూ? ఎవడబ్బ సొమ్మని ఫ్లెక్సీలు కడతారని చించుకుంటున్నావు. 14 ఏళ్లు సీఎంగా చేసినోడివి ఇంతగా పతనమవుతావని అనుకోలేదు' అని విజయసాయిరెడ్డి విమర్శించారు.

Vijay Sai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News