సేవ చేయాలన్న తపనతోనే పోరాటాలు చేస్తున్నా!: పవన్ కల్యాణ్
- దేశం కోసం ఓపికగా ముందుకు వెళ్తున్నా..
- మార్పు కోసం సహనం అవసరం
- యువత ఇంటర్నెట్ లో కాకుండా చుట్టూ చూసి నేర్చుకోవాలని సూచన
దేశానికి సేవ చేయాలన్న తపనతోనే రాజకీయ పార్టీని స్థాపించానని, ప్రజలకు సేవ చేసేందుకే పోరాటాలు కొనసాగిస్తున్నానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. భగత్ సింగ్ లాంటి వారు తనకు ఆదర్శమన్నారు. పోటీ చేసిన రెండు చోట్లా ఓడినా రాజకీయ పోరాటాన్ని ఆపలేదని, లక్ష్యం కోసం పనిచేస్తూనే ఉన్నానని తెలిపారు. గురువారం ఢిల్లీలోనిర్వహించిన ‘ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్’ సమావేశంలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. యువతలో ఆవేశాన్ని అర్థం చేసుకుని వారితో మాట్లాడానని చెప్పారు.