ఇండియా, పాకిస్థాన్ ఉల్లి, ఆలుగడ్డలు ఎగుమతి చేసుకోవచ్చుగానీ.. క్రికెట్ ఆడకూడదా?: పాక్ క్రికెటర్ షోయబ్ అక్తర్
- ఇండియా, పాక్ క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించాలి
- అవసరమైతే తటస్థ వేదికలపై ఆడాలి
- మిగతా స్పోర్ట్స్ లో లేనిది క్రికెట్ లో ఎందుకని ప్రశ్న
ఇండియా, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ లను ఆపేయడం సరికాదని.. అన్ని ఆటల్లో లేనిది క్రికెట్ లో ఎందుకు ఉండాలని పాకిస్తాన్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నారు. ఒక దేశం నుంచి మరో దేశానికి ఉల్లిపాయలు, ఆలుగడ్డల ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయని.. అలాంటప్పుడు క్రికెట్ మాత్రం ఎందుకు ఆడకూడదని ప్రశ్నించారు. అయితే తాను ఎవరినీ తప్పుపట్టడం లేదని, ఇరు దేశాల మధ్య మ్యాచ్ లు జరగడం క్రికెట్ కు మంచిదని వ్యాఖ్యానించారు.