దొంగలను చూసి మొరగాల్సిన కుక్కలు తోకలు ఊపుతున్నాయి: విజయసాయిరెడ్డి

  • చంద్రబాబు ట్రయినింగ్ అలాగే ఉంటుంది
  • దోపిడీదారులు నిప్పు కణికల్లా బిల్డప్ ఇస్తుంటారు
  • అందరిపైనా వారే నిందలు మోపుతారు
  • మరోవైపు నీతి సూక్తులు వల్లిస్తుంటారు 
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన వద్ద శిక్షణ తీసుకున్న కొందరు దోపిడీదారులు ఇతరులపై నిందలు మోపుతూ, మరోవైపు నీతి సూక్తులు వల్లిస్తున్నారని ఆరోపించారు.

'దొంగలను చూసి మొరగాల్సిన కుక్కలు తోకలు ఊపుతున్నాయి. చంద్రబాబు ట్రయినింగ్ అలాగే ఉంటుంది. దోపిడీదారులు నిప్పు కణికల్లా బిల్డప్ ఇస్తుంటారు. అందరిపైనా వారే నిందలు మోపుతూ, చూశారా మేమొండిన పరమాన్నం ఇంకా చల్లారనే లేదని నీతి సూక్తులు వల్లిస్తుంటారు' అని ట్వీట్ చేశారు.

Vijay Sai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News