మండలిలో ఆ రెండు బిల్లులు పాసైనట్టే లెక్క: పిల్లి సుభాష్ చంద్రబోస్ లాజిక్

  • వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై వ్యాఖ్యలు 
  • ఆ బిల్లులను తిరస్కరించలేదు
  • సెలెక్ట్ కమిటీలకు ఇక అవకాశం లేదు
  • అంటే ఆమోదించినట్టేగా
ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలెక్ట్ కమిటీలు ఏర్పాటు అయ్యాయని ఓపక్క ప్రతిపక్ష నేతలు.. అసలు వాటిని ఏర్పాటు చేసేందుకే అవకాశం లేదని మరోపక్క అధికారపక్ష సభ్యుల వ్యాఖ్యలు హోరెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ లాజికల్ వ్యాఖ్యలు చేశారు.

ఈ బిల్లులను ఆమోదించాలి లేదా తిరస్కరించాలి, లేనిపక్షంలో సెలెక్ట్ కమిటీకైనా పంపించాలని, ప్రతిపక్షానికి వున్నవి ఈ మూడు ఆప్షన్సే అని అన్నారు. సెలెక్ట్ కమిటీ బాగోతం చూశాం కనుక, ఇక, దానికి అవకాశం లేదని, ఆ బిల్లులను తిరస్కరించడం కూడా చేయలేదు కనుక ఆమోదించినట్టే కదా? అని ఆయన లాజికల్ ధోరణిలో మాట్లాడారు. ఆ రెండు బిల్లులను తిరస్కరించకుండా, సెలెక్ట్ కమిటీకి పంపకుండా చేయడం ద్వారా రెండు మార్గాలను మూసేసుకున్నారు కనుక వాటిని ఆమోదించేసినట్టే అని, బిల్లులు పాసైనట్టే లెక్క అని చెప్పారు.

Pilli subhash chandra bose
AP Legislative Council
Two bills

More Telugu News