కేంద్రానికి చేరిన ఏపీ 'శాసన మండలి రద్దు' తీర్మానం

  • నిన్న రాత్రే కీలక పరిణామం
  • బిల్లుల అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన శాసనసభ సచివాలయం
  • శాసనసభ తీర్మానాన్ని కేంద్ర న్యాయ, హోం శాఖలకు పంపిన రాష్ట్ర ప్రభుత్వం
శాసనమండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని శాసనసభలో ఆమోదింపజేసుకున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రే తీర్మానం ప్రతిని, ఓటింగ్ వివరాలకు సంబంధించిన పూర్తి అంశాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శాసనసభ సచివాలయం పంపింది.

శాసనసభ సచివాలయం నుంచి బిల్లులకు సంబంధించిన అంశాలను అందుకున్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వం.. 'మండలి రద్దు' తీర్మానాన్ని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శికి పంపింది. కేంద్ర న్యాయశాఖతో పాటు హోంశాఖకు ఈ తీర్మానం అందింది. అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇందుకు సంబంధించిన ప్రతిని పంపింది.

శాసనమండలి రద్దు తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాల్సి ఉంటుంది. అనంతరం రాష్ట్రపతి కూడా ఆమోదించి, నోటిఫికేషన్‌ జారీ చేస్తే మండలి రద్దు అవుతుంది. అప్పటివరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టే ప్రతి బిల్లూ మండలికి వెళ్లాల్సిందే.
Go Back to Shorts
BJP
YSRCP
Telugudesam

More Telugu News