స్మార్ట్ సిటీ లక్ష్యాలను చేరుకోవడంలో అమరావతికి అవార్డు

  • రికగ్నేషన్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ కేటగిరీలో ఏపీ రాజధానికి అవార్డు
  • విశాఖకు ఫ్లోటింగ్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుపై పురస్కారం
  • విశాఖలో స్మార్ట్ సిటీల మూడో శిఖరాగ్ర సమావేశం
ఏపీ రాజధాని అమరావతిపై అనిశ్చితి నెలకొన్న తరుణంలో ఓ అవార్డు లభించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. స్మార్ట్ సిటీ మిషన్ లక్ష్యాలను చేరుకోవడంలో కనబర్చిన పురోగతి ఆధారంగా అమరావతిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. స్మార్ట్ నగరాల అంశంలో రికగ్నేషన్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ కేటగిరీలో అమరావతికి ఈ పురస్కారం లభించింది. విశాఖలో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఆకర్షణీయ నగరాల మూడో శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో భాగంగా పలు అంశాల్లో ఆదర్శంగా నిలిచిన నగరాలకు అవార్డులు అందిస్తున్నారు. కాగా, విశాఖపట్నం నగరానికి వినూత్న ఆవిష్కరణల అంశంలో ఫ్లోటింగ్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుపై అవార్డు అభించింది.
Go Back to Shorts
Amaravati
Smart Cities
Visakhapatnam

More Telugu News