క్రికెట్ ఆడిన చీఫ్ జస్టిస్ బాబ్డే... టాప్ స్కోరర్ గా నిలిచిన జస్టిస్ బాబ్డే!

  • నాగపూర్ లో న్యాయమూర్తులు, న్యాయవాదుల మ్యాచ్
  • వ్యక్తిగతంగా 18 పరుగులు చేసిన బాబ్డే
  • క్రికెట్ ఆడటం సంతోషాన్ని కలిగించిందని వ్యాఖ్య
నిత్యమూ కేసుల విచారణతో బిజీగా ఉండే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే, కాసేపు క్రికెట్ ఆడి సేదదీరారు. నాగపూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ లో ఆల్ జడ్జెస్ ఎలెవన్, హైకోర్ట్ బార్ అసోసియేషన్ ఎలెవన్ జట్ల మధ్య 15 ఓవర్ల మ్యాచ్ జరుగగా, ఆల్ జడ్జెస్ తరఫున బాబ్డే ఆడారు. వ్యక్తిగతంగా 18 పరుగులు సాధించి తన జట్టులో టాప్ స్కోరర్ గానూ నిలిచారు. అయితే, ఈ పోటీలో ప్రత్యర్థి జట్టు బార్ అసోసియేషన్ విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఆయన, ఇలా క్రికెట్ ఆడటం తనకెంతో ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలిగించిందన్నారు.
Go Back to Shorts
CJ Bobde
Cricket
Nagpur

More Telugu News