పయ్యావుల గారు చంద్రబాబు తండ్రి, తాతల ఆస్తుల గురించి మాట్లాడితే బాగుంటుంది: విజయసాయి రెడ్డి

  • రాష్ట్ర ప్రజానీకం అఖండ మెజారిటీతో గెలిపించింది
  • ఈ ప్రభుత్వాన్ని ‘ఇన్ సైడర్లు’ ఛాలెంజ్ చేస్తున్నారు
  • కమీషన్ల కోసం  తాము మొదలు పెట్టినవన్నీ కొనసాగించాలంటున్నారు
టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వానికి కొందరు సవాళ్లు విసురుతున్నారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలిచిందని అటువంటి సర్కారుకి సవాళ్లు విసురుతున్నారని ట్వీట్ చేశారు.

'రాష్ట్ర ప్రజానీకం అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రభుత్వాన్ని‘ఇన్ సైడర్లు’ ఛాలెంజ్ చేస్తున్నారు. కమీషన్ల కోసం మేం మొదలు పెట్టినవన్నీ కొనసాగించాలంటున్నారు. గోబెల్స్ ప్రచారాలకు తెగబడుతున్నారు. పయ్యావుల గారు తన బాస్ చంద్రబాబు తండ్రి, తాతల ఆస్తుల గురించి మాట్లాడితే బాగుంటుంది' అని విజయసాయి రెడ్డి విమర్శించారు.
Go Back to Shorts
Payyavula Keshav
Vijay Sai Reddy
YSRCP

More Telugu News