సుజనా చౌదరిపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు పట్ల స్పందించిన రాష్ట్రపతి

  • సుజనా చౌదరి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ విజయసాయి ఫిర్యాదు
  • ఈ ఫిర్యాదును హోం శాఖకు పంపామన్న రాష్ట్రపతి 
  • సంబంధిత శాఖలకు హోం శాఖ పంపినట్టు సమాచారం
బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ లేఖ ద్వారా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సుజనా చౌదరి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని, దీనిపై విచారణ జరపాలని కోరుతూ రాసిన ఈ లేఖపై రామ్ నాథ్ కోవింద్ స్పందించారు. ఇందుకు సంబంధించిన లేఖ విజయసాయికి వచ్చింది. రాష్ట్రపతి ఆఫీస్ నోట్ తో రీడైరెక్ట్ కావడంతో ఆ లేఖను సంబంధింత శాఖలకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పంపినట్టు సమాచారం. కాగా, సుజనా చౌదరి ఆర్థిక నేరాలపై ఈడీ, సీబీఐతో దర్యాప్తు చేయించాలని తన లేఖలో విజయసాయిరెడ్డి కోరారు.
Go Back to Shorts
BJP
Sujana Chowdary

More Telugu News