విజయవాడలో చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించిన సీఎం జగన్ కుటుంబసభ్యులు

  • శేషసాయి కల్యాణమంటపంలో వస్త్ర ప్రదర్శన 
  • అనేక స్టాళ్లను ఆసక్తిగా తిలకించిన వైఎస్ విజయమ్మ, భారతి
  •  వైఎస్ కుటుంబీకుల రాకతో కిటకిటలాడిన కల్యాణమంటపం
విజయవాడలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను సీఎం జగన్ కుటుంబసభ్యులు సందర్శించారు. విజయవాడ శేషసాయి కల్యాణమంటపంలో ఏర్పాటుచేసిన ఈ ఎగ్జిబిషన్ కు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి విచ్చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను ఆసక్తిగా పరిశీలించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆభరణాల స్టాళ్లను కూడా తిలకించారు. ఈ సందర్భంగా ఇరువురు కొన్నింటిని కొనుగోలు చేశారు. దాదాపు గంటసేపు ఆ వస్త్రప్రదర్శనలో వారు సందడి చేశారు.

కాగా, విజయమ్మ, భారతి రావడంతో ఎగ్జిబిషన్ నిర్వాహకులు స్వాగతం పలికారు. వైఎస్ కుటుంబీకులు వచ్చారని తెలియడంతో మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. విజయమ్మ, భారతి తమను కలిసిన మహిళలతో సాదరంగా మాట్లాడారు.

Go Back to Shorts
vijayawada

More Telugu News