నరసరావుపేట ఎంపీ ఇంటిపై దుండగుల దాడి

  • ధ్వంసమైన అద్దాలు
  • వెంటనే ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా వాచ్ మెన్ కు వార్నింగ్
  • విచారణ ప్రారంభించిన పోలీసులు
గుంటూరు జిల్లా నరసరావుపేట వైసీపీ పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో నరసరావుపేటలోని ఆయన నివాసం అద్దాలు ధ్వంసం అయ్యాయి. దాడి చేసిన అనంతరం వెంటనే ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా దుండగులు వాచ్ మెన్ ను బెదిరించి పరారయ్యారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. అనంతరం పోలీసులు ఎంపీ ఇంటికి చేరుకుని విచారణ ప్రారంభించారు. దుండగులకు సంబంధించిన వివరాలను వాచ్ మెన్ ను అడిగి తెలుసుకున్నారు.
Go Back to Shorts
Guntur District
Narsaraopet
Mp
Lavu srikrishna

More Telugu News