'నిశ్శబ్దం' నుంచి హాలీవుడ్ స్టార్ ఫస్టులుక్

  • అనుష్క తాజా చిత్రంగా 'నిశ్శబ్దం'
  • ఆసక్తిని పెంచుతున్న విభిన్నమైన కాన్సెప్ట్ 
  •  దాదాపు అమెరికాలోనే జరిగిన చిత్రీకరణ  
అనుష్క ప్రధాన పాత్రధారిగా 'సైలెంట్' చిత్రం నిర్మితమైంది. హేమంత్ మధుకర్ రూపొందించిన ఈ సినిమా, తెలుగులో 'నిశ్శబ్దం' పేరుతో రానుంది. ఈ సినిమాలో అనుష్క చిత్రకారిణిగా కనిపించనుంది. కథాపరంగా ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువ భాగం అమెరికాలో జరిగింది. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్సన్ నటించాడు.

రిచర్డ్ డికెన్స్ అనే పోలీస్ కెప్టెన్ పాత్రలో ఆయన కనిపించనున్నాడు. కథలో కీలకంగా కనిపించే ఈ పాత్ర .. ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. తాజాగా వదిలిన ఆయన ఫస్టులుక్ .. సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అనుష్క భర్త పాత్రలో మాధవన్ నటించగా, అంజలి .. షాలినీ పాండే ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. సస్పెన్స్ .. హారర్ .. థ్రిల్లర్ అంశాలతో కూడిన ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Anushka
Madhavan
Anajali
Shalini

More Telugu News