14 ఏళ్లలో ఆరుగురు కుటుంబీకులను హత్య చేసిన యువతి... తీవ్ర కలకలం!

  • 2002 నుంచి హత్యాకాండ
  • ఆస్తి కోసం హత్యలు చేసిన కోడలు
  • సైనైడ్ వాడుతూ కడతేర్చిన వైనం
కేరళలోని కోజికోడ్ లో 2002 నుంచి 2016 వరకూ ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మరణించగా, చివరి మరణాల తరువాత అనుమానం వచ్చిన పోలీసులు, కేసును తోడి నమ్మలేని నిజాలను వెలికితీశారు. ఆస్తి కోసం ఇంటి కోడలు జూలీ, తన రెండో భర్త షాజుతో కలిసి ఒక్కొక్కరినీ హతమారుస్తూ వచ్చిందని తేల్చారు. అత్యంత పకడ్బందీగా జరిగిన ఈ హత్య కేసు తమ ముందు ఎన్నో సవాళ్లను ఉంచిందని పోలీసు అధికారులు పేర్కొన్నారు.

2002లో తొలి హత్య జరిగినప్పుడు దాన్ని జోలీ కుటుంబీకులు సాధారణ మరణంగానే భావించారు. జోలీ అత్త అన్నమ్మ థామస్ అప్పట్లో కుప్పకూలి మరణించింది. ఆపై ఆరేళ్లకు ఆమె భర్త టామ్ థామస్ గుండె విఫలమై మరణించాడు. వారి కుమారుడు జోలీ భర్త రాయ్ థామస్ 2011లో ఇదే విధంగా మరణించగా, పోస్టుమార్టంలో విషపు ఆనవాళ్లు కనిపించాయి. ఆ సమయంలో కేసును పోలీసులు సీరియస్ గా తీసుకోలేదు. దీంతో జోలీ హత్యాకాండ కొనసాగింది. 2014లో అన్నమ్మ థామస్ సోదరుడు మ్యాథ్యూ మంజాదియల్ కూడా అనుమానాస్పద స్థితిలో మరణించగా, 2016లో అల్ఫాన్సా అనే రెండేళ్ల చిన్నారి, ఆపై నెలల వ్యవధిలో ఆమె తల్లి సిల్లీ మరణించారు.

ఈ హత్యలను కేరళ పోలీసులు ఛేదించగా, ఇప్పుడీ వార్త తీవ్ర కలకలం రేపుతోంది. ఆస్తిని తన పేరిట బదలాయించుకోవాలని భావించిన జోలీ, మామ టాప్ పై ఒత్తిడిని పెంచిందని, అయితే, యూఎస్ లో ఉన్న టామ్ చిన్న కుమారుడు మోజో, తనకు వచ్చిన అనుమానంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించగా, మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. తన రెండో భర్తతో కలిసి సైనైడ్ ను ఉపయోగించిన జోలీ, ఈ హత్యలకు తెగబడిందని పోలీసులు తేల్చారు.
Go Back to Shorts
Kerala
Murders
Lady

More Telugu News