భీమవరం చిరంజీవి అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన ఉపాసన

  • భీమవరంలో 250 అడుగుల చిరంజీవి కటౌట్ ఏర్పాటు చేసిన అభిమానులు
  • అర కిలో మీటర్ మేర బ్యానర్ ఏర్పాటు
  • ధన్యవాదాలు తెలిపిన ఉపాసన
భీమవరం మెగా అభిమానులపై రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రత్యేక ట్వీట్ చేశారు. మామయ్య చిరంజీవి హీరోగా, భర్త రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కిన 'సైరా' చిత్రం విడుదల సందర్భంగా ఆసక్తికర ట్వీట్ చేశారు. 'మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు' అని ట్వీట్ చేశారు.

భీమవరంలో చిరు అభిమానులు 250 అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేశారు. దాదాపు అర కిలోమీటర్ వరకు బ్యానర్ కట్టారు. ఈ బ్యానర్ ను ఉపాసన తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అభిమానులకు ఉపాసన ధన్యవాదాలు తెలిపారు.

Sye Raa Narasimha Reddy
Chiranjeevi
Ramcharan
Upasana
Tollywood

More Telugu News