అధికారంలో ఉండగా వేల కోట్లు దోచుకున్నారు... చంద్రబాబు, లోకేశ్ లపై లోకాయుక్తకు ఫిర్యాదు

  • లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన బీసీ సంఘం నేత
  • అవినీతి సొమ్మును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచన
  • విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ అధికారంలో ఉన్నప్పుడు  వేల కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడ్డారని వెనుకబడిన వర్గాల నాయకుడు డేరంగుల ఉదయ్ కిరణ్ ఏపీ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ​వీరిద్దరే కాకుండా అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం అందినకాడికి దోచుకున్నారని ఉదయ్ కిరణ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఇసుకలో దోపిడీ, రాజధాని నిర్మాణంలో అక్రమాలు, పోలవరం అవకతవకల్లో వీరి హస్తం ఉందని తెలిపారు. ప్రజల ధనాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారని, వారిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ నేతల అవినీతి సంపాదనను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు.
Go Back to Shorts
Chandrababu
Nara Lokesh
Lokayukta

More Telugu News