యువ దర్శకుడితో అఖిల్ ఐదో సినిమా

  • వరుస పరాజయాలతో అఖిల్ 
  • 'బొమ్మరిల్లు' భాస్కర్ సినిమాపై ఆశలు 
  • ప్రశాంత్ వర్మ కథకి ఓకే చెప్పిన అఖిల్
అఖిల్ హీరోగా ఇంతవరకూ వచ్చిన 3 సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి. దాంతో ఈ సారి కథల విషయంలో ఆయన మరింత శ్రద్ధ తీసుకుని, 'బొమ్మరిల్లు' భాస్కర్ కి ఓకే చెప్పాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చకచకా జరుగుతోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే అఖిల్ తన ఐదో సినిమాను లైన్లో పెట్టడానికి ఉత్సాహాన్ని చూపుతున్నాడు. యువ కథానాయకులు సిద్ధం చేసిన కథలను వింటున్నాడు.

ఇటీవల 'అ' దర్శకుడు ప్రశాంత్ వర్మ వినిపించిన కథ అఖిల్ కి నచ్చేసిందని అంటున్నారు. ప్రశాంత్ వర్మ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని చెబుతున్నారు. నిజానికి కాజల్ ప్రధాన పాత్రధారిగా ఒక సినిమాను రూపొందించాలని ప్రశాంత్ వర్మ ప్లాన్ చేసుకున్నాడు. అందుకు ఆలస్యం అవుతుండటంతో ఆయన అఖిల్ ను లైన్లో పెట్టేశాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో వున్నారు.
Go Back to Shorts
Akhil
Prashanth

More Telugu News