గోదావరి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన కేసీఆర్

  • గోదావరిలో బోటు మునక
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్
  • బాధితుల కుటుంబాలకు సానుభూతి
ఏపీలో లాంచీ ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో పర్యాటక బోటు మునిగిపోయిన ఘటనలో పలువురు తెలంగాణ వాసులు కూడా గల్లంతయ్యారు. దీనిపై స్పందించిన కేసీఆర్ బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మంత్రి పువ్వాడ అజయ్ ను సహాయక చర్యలు పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు. సీఎం ఆదేశాలతో పువ్వాడ వెంటనే రాజమండ్రికి బయల్దేరారు. ఈ ఘటనలో హైదరాబాద్, వరంగల్ కు చెందిన వారు కూడా ఉండడంతో ప్రత్యేకంగా హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసి సోషల్ మీడియాలో అందుబాటులో ఉంచారు.
Go Back to Shorts
Godavari
East Godavari District
Boat
KCR
Telangana
Hyderabad
Warangal

More Telugu News