ఏపీలో రెండ్రోజుల పాటు బలమైన ఈదురుగాలులు... వినాయక మంటపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు

  • వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
  • ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
  • ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు
వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలో రెండ్రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని, ఈ కారణంగా వినాయక మంటపాల నిర్వాహకులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఎస్డీఆర్ఎఫ్ అధికారులు హెచ్చరించారు. మంటపాల పటిష్టతకు తగినవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Bay Of Bengal

More Telugu News