ఆంధ్రప్రదేశ్ లో గ్రామ స్వరాజ్యం దిశగా అడుగు వేశాం!: ముఖ్యమంత్రి జగన్
- అందులో భాగంగా వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించాం
- ప్రజలు ఎవరిచుట్టూ తిరగాల్సిన పనిలేదు
- ట్విట్టర్ లో స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ స్వరాజ్యం దిశగా అడుగు వేశామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగా వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించామని చెప్పారు. ప్రజలు తమ కనీస అవసరాల కోసం ఎవరిచుట్టూ తిరగాల్సిన పనిలేకుండా చేస్తున్నామన్నారు.
ప్రతీ 50 కుటుంబాలకు ఓ వాలంటీర్ బాధ్యతను తీసుకుంటారనీ, సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేస్తారని పేర్కొన్నారు. గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయంతో అనుసంధానమై ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఈ మేరకు ఆయన ఈరోజు ట్వీట్ చేశారు.
ప్రతీ 50 కుటుంబాలకు ఓ వాలంటీర్ బాధ్యతను తీసుకుంటారనీ, సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేస్తారని పేర్కొన్నారు. గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయంతో అనుసంధానమై ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఈ మేరకు ఆయన ఈరోజు ట్వీట్ చేశారు.