భారత్ హై కమీషనర్ ని బహిష్కరించిన పాకిస్థాన్

  • భారత్ పై ఆక్రోశం వెళ్లగక్కుతున్న పాక్
  • దౌత్య సంబంధాలు తగ్గించుకోవాలని నిర్ణయం 
  • తమ హై కమిషనర్ ను వెనక్కు పిలవనున్న పాక్ 
జమ్ముకశ్మీర్ పునర్విభజన చట్టం తీసుకురావడం, ఆర్టికల్ 370, 35-A రద్దుతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ తో దౌత్య సంబంధాలు తగ్గించాలని, ద్వైపాక్షిక వాణిజ్యం నిలిపివేయాలని తాజా నిర్ణయం తీసుకున్న పాకిస్థాన్, ఆ దేశంలో భారత రాయబారిని బహిష్కరించింది. మన రాయబారిని వెనక్కి వెళ్లిపోవాలని కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, ఢిల్లీలోని తమ హై కమిషనర్ ను వెనక్కు పిలవాలని పాక్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. 
Go Back to Shorts
Jammu And Kashmir
Pakistan

More Telugu News