అమ్మ మరణం ఆమె కోరుకున్నట్టుగానే జరిగింది: సీనియర్ నరేశ్

  • అమ్మ ఎంతో ధైర్యంగా ఉండేది 
  • చివరి రోజుల్లో నడవడానికి ఇబ్బంది పడింది 
  • అమ్మ కన్నీరు పెట్టుకుంది  
నటిగా దర్శక నిర్మాతగా విజయనిర్మల తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇటీవలే అనారోగ్యంతో ఆమె కన్ను మూశారు. ఆమె చివరి రోజులను గురించి 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో నరేశ్ ప్రస్తావించాడు.

 "అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ అమ్మ ఎంతో ధైర్యంగా ఉండేది. అలాంటి అమ్మ ఒక రోజున కన్నీళ్లు పెట్టుకుంది. 'కృష్ణ గారికి నేను సేవలు చేయవలసిన సమయం ఇది. కానీ ఆయనే నన్ను బిడ్డలా చూసుకునే పరిస్థితి వచ్చింది. ఆయనను ఇబ్బంది పెడుతున్నందుకు నాకు చాలా బాధగా వుంది' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు మాత్రం తట్టుకోలేక నేను కూడా ఏడ్చేశాను. చివరి రోజుల్లో ఆమె నడవడానికి చాలా ఇబ్బంది పడింది. ఆమె బాబా భక్తురాలు గనుక 'గురువారం' రోజునే చనిపోవాలని కోరుకుంది. ఆమె కోరుకున్నట్టుగానే జరిగింది" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Naresh
Ali

More Telugu News