చంద్రుడిని ఢీకొట్టి ధ్వంసమైన చైనా వ్యోమ నౌక

  • గత ఏడాది జాబిల్లిపైకి పంపిన డ్రాగన్‌
  • దీని బరువు 47 కిలోలు
  • 437 రోజులపాటు చంద్రుడి చుట్టూ భ్రమణం
భారత్‌ చంద్రయాన్‌-2తో జాబిల్లివైపు దూసుకుపోతున్న వేళ చైనాకు చెందిన ఓ వ్యోమనౌక చందమామను ఢీకొట్టి ధ్వంసమైంది. గత ఏడాది మేలో డ్రాగన్‌ చంద్రునిపైకి ‘లాంగ్‌జియాంగ్‌-2’ పేరుతో వ్యోమనౌకను ప్రయోగించింది. ఈ నౌక నిన్న జాబిల్లి ఉపరితలాన్ని ఢీకొట్టి అంతమైంది. 47 కిలోల బరువున్న ఈ బుల్లి వ్యోమ నౌక చంద్రుడి చుట్టూ 437 రోజుపాటు పరిభ్రమించింది. ఈ వ్యోమనౌకలో సౌదీ అరెబియాకు చెందిన ఓ ఆప్టికల్‌ కెమెరాను అమర్చారు. కాగా, తాము ప్రయోగించిన వ్యోమనౌక అనుకున్న సమయంలో తన పని పూర్తిచేసుకుని నిర్దేశిత ప్రాంతంలోనే జాబిల్లి ఆవలి ప్రాంతాన్ని ఢీకొట్టి ధ్వంసమైందని చైనా అంతరిక్ష సంస్థ ప్రకటించింది.
Go Back to Shorts
chaina
moon shuttle
long xiang colluded

More Telugu News