ప్రభాస్ 'సాహో' విడుదల వాయిదా

  • ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సాహో’
  • ‘సాహో’ ఆగస్ట్ 30కి వాయిదా
  • ఆగస్ట్ 15న రానున్న ‘రణరంగం’
‘బాహుబలి’ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘సాహో’. నేటితో ఈ సినిమాకు చిత్రబ‌ృందం గుమ్మడికాయ కొట్టేసింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా విడుదల మరికొన్ని రోజులు ముందుకు వెళ్లింది.

తొలుత ‘సాహో’ను ఆగస్ట్ 15న విడుదల చేస్తామని చెప్పినప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవుతుండటంతో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 30కి వాయిదా వేశారు. ప్రస్తుతం ఈ సినిమా స్థానాన్ని యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రణరంగం’ చిత్రం ఆక్రమిస్తోంది. నిజానికి ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల రీత్యా ‘రణరంగం’ విడుదలను చిత్రబ‌ృందం ఆగస్ట్ 15కు వాయిదా వేసింది. ఈ చిత్రంతో పాటు అడవి శేష్ హీరోగా నటిస్తున్న ‘ఎవరు’ సినిమా కూడా విడుదల కాబోతోంది. దీనిని బట్టి చూస్తే ఆగస్ట్ మొత్తం సినీ ప్రియులకు పండగలా కనిపిస్తోంది.
Go Back to Shorts
Prabhas
Sahoo
Ranarangam
Sharvanand
Adavi sesh
Evaru

More Telugu News