భారీ స్థాయిలో రూపొందనున్న 'రామాయణ'

  • మళ్లీ తెరపైకి 'రామాయణం'
  • 'రామాయణ' టైటిల్ తో 3 భాషల్లో నిర్మాణం
  •  3D వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకు  
రమణీయమైన ఇతిహాసంగా 'రామాయణం' తెలుగువారి మనసులను దోచుకుంది. అలాంటి రామాయణం కథా వస్తువుగా వచ్చిన సినిమాలు చాలా వరకూ భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అలాంటి రామాయణ కథ ఈ సారి అత్యంత భారీస్థాయిలో వెండితెరపై ఆవిష్కృతం కానుంది.

'రామాయణ' పేరుతో ఈ సినిమాను నిర్మించడానికి అల్లు అరవింద్ .. మధు మంతెన .. నమిత్ మల్హోత్ర రంగంలోకి దిగారు. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో 3 భాగాలుగా 3D వెర్షన్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 'దంగల్' దర్శకుడు నితేశ్ తివారీ .. 'మామ్' దర్శకుడు రవి ఉదయవర్ ఈ సిరీస్ కి దర్శకులుగా వ్యవహరించనున్నారు. 'రామాయణ' మొదటిభాగం 2021లో విడుదల కానున్నట్టుగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దేశంలోని వివిధ భాషల నుంచి నటీనటులను ఎంపిక చేస్తారు.
Go Back to Shorts
Alli Aravind
Madhu Mantena
Namith Malhotra

More Telugu News