ఇది దేవుడే రాసిన స్క్రిప్ట్: వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • 23 మందిని లాగేసుకున్నారు
  • 23 మందే మిగిలారు
  • అది కూడా 23వ తారీఖునే తెలిసిందన్న జగన్
తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన తెలుగుదేశం పార్టీ విషయంలో దేవుడు అద్భుతమైన స్క్రిప్ట్ రాశాడని సీఎం వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "దేవుడు రాసిన స్క్రిప్ట్ ఎంత గొప్పగా ఉంటుందనడానికి, జరిగిన ఎన్నికలే అధ్యక్షా నిదర్శనం. ఎమ్మెల్యేలను కొన్న వారికి వచ్చిన సీట్లు ఎన్నో తెలుసా అధ్యక్షా?... అక్షరాలా 23 సీట్లు. ఎంపీలను కొన్నవారికి... ముగ్గురు ఎంపీలను కొన్నవారికి అక్షరాలా వాళ్లకు వచ్చిన సీట్లు ఎన్నో తెలుసా అధ్యక్షా? మూడు. అది కూడా అధ్యక్షా... ఎప్పుడొచ్చిందో తెలుసా? అది కూడా 23వ తారీఖున. ఎంత గొప్పగా జరిగిందంటే... దేవుడు ఇలా కూడా స్క్రిప్ట్ రాస్తాడు అధ్యక్షా" అని అన్నారు.
Go Back to Shorts
Jagan
Chandrababu
God
Assembly

More Telugu News