ఈ ఉదయం కూడా విజయవాడలో వర్షం... జగన్ ప్రభావమంటున్న వైసీపీ శ్రేణులు!

  • కరవు తీరిపోయి నేల సస్యశ్యామలం అవుతుంది
  • జగన్ కు దేవుడి ఆశీర్వాదం ఉందంటున్న వైసీపీ
  • శివార్లలోనే ఆగిపోతున్న కార్యకర్తల వాహనాలు
గత రాత్రి భారీ వర్షం కురిసినప్పటికీ, జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇబ్బందులు రాకూడదని అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయగా, ఈ ఉదయం నుంచి కూడా విజయవాడలో చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. ఇక ఇది జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ, భగవంతుడి ఆశీర్వాదమని, కరవు పోయి, నేల సస్యశ్యామలం అవుతుందని వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి.

కాగా, భారీ వర్షం పడినా ఏ విధమైన ఆటంకం లేకుండా ప్రమాణ స్వీకారోత్సవం పూర్తయ్యేందుకు ఏర్పాట్లు చేశామని, ఎవరూ తడవకుండా టెంట్లు నిర్మించామని అధికారులు తెలిపారు. కాగా, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి ఈ ఉదయం విజయవాడకు వచ్చిన వందలాది మంది వైసీపీ కార్యకర్తలను పోలీసులు మంగళగిరి సమీపంలోను; విశాఖ, శ్రీకాకుళం నుంచి వచ్చిన వారిని గన్నవరం సమీపంలోను నిలిపివేయడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. స్టేడియం ఇప్పటికే నిండిపోయిన కారణంగా సాధారణ ప్రజలను నగరంలోకి వాహనాలతో అనుమతించబోమని పోలీసులు అంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
Go Back to Shorts
Jagan
Oath
Vijayawada
Rain

More Telugu News