కుండ తయారీకి ఎంత నైపుణ్యం, ఓపిక అవసరమో ప్రత్యక్షంగా చూశా: నారా లోకేశ్

  • శాలివాహన కాలనీలో ఎన్నికల ప్రచారం
  • కుమ్మరుల సమస్యలకు సరైన పరిష్కారం చూపుతా
  • వారి అభివృద్ధికి ప్రణాళికలు అమలు చేస్తాం
ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేశ్ తీరికలేకుండా ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న లోకేశ్ ఈరోజు ప్రచారంలో పాల్గొన్నారు. శాలివాహన కాలనీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కుమ్మరి సోదరులను కలుసుకున్నారు. మట్టికుండలను ఏవిధంగా తయారు చేస్తారో దగ్గరుండి ఆయన పరిశీలించారు.

 ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, రోజువారీ పనులలో వారికి ఎదురయ్యే సమస్యలకు సరైన పరిష్కారం చూపుతానని, వారి అభివృద్ధికి ప్రణాళికలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక కుమ్మరి సోదరుడితో కలిసి కుండ తయారీలో పాల్గొన్నారు. కుండ తయారు చేసే క్రమంలో ఎంత నైపుణ్యం, ఓపిక అవసరమో ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నానని లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
Go Back to Shorts
Guntur District
Mangalagiri
Telugudesam
Nara Lokesh

More Telugu News