కె.ఎ.పాల్‌కు షాక్‌... ఆయన పార్టీ హెలికాప్టర్‌ గుర్తును పక్కన పెట్టిన ఈసీ

  • ఫ్యాన్‌ను పోలినట్టు ఉందని వైసీపీ ఫిర్యాదు
  • అభ్యంతరం వ్యక్తం చేసిన పాల్‌
  • పట్టించుకోని ఎన్నికల సంఘం
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఆయన పార్టీ గుర్తు హెలికాప్టర్‌ను పక్కనపెట్టింది. ఆయన హెలికాప్టర్‌ గుర్తు తమ పార్టీ గుర్తు ఫ్యాన్‌ను పోలి ఉండడంతో ఎన్నికల్లో తమకు నష్టం జరిగే అవకాశం ఉందని, అందువల్ల  దాన్ని తొలగించాలని వైసీపీ మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

 ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ పాల్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన పాల్‌ ప్రపంచంలో ఎక్కడైనా హెలికాప్టర్‌, ఫ్యాన్‌ ఒకేలా ఉండడం చూశామా? ఇందులో వైసీపీ దురుద్దేశం ఉందని ఆరోపించారు. రెండు గుర్తుల మధ్య తేడాను ప్రజలు స్పష్టంగా గుర్తించగలరని ఈసీకి సమాధానమిచ్చారు. పాల్‌ స్పందనను పెద్దగా పట్టించుకోని ఈసీ ఆయన గుర్తును పక్కన పెడుతూ నిర్ణయం తీసుకుంది.
Go Back to Shorts
KApal
prajasanthi
symbol
cec

More Telugu News