తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ కిరీటాల దొంగ దొరికేశాడు!

  • తమిళనాడులో పట్టుబడిన వ్యక్తి
  • పాత దొంగేనని తేల్చిన పోలీసులు
  • పలు కోణాల్లో విచారణ
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ విగ్రహాల కిరీటాలను దొంగిలించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు, కేసును సీరియస్ గా తీసుకుని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సీసీటీవీ కెమెరాల్లో పరిగెత్తుతూ, చేతిలో పైన గుడ్డ చుట్టి కిరీటీలను తీసుకెళుతూ కనిపించిన వ్యక్తి, పాత దొంగ ముత్తయ్య అని పోలీసులు గుర్తించారు.

గతంలో తిరుపతిలోని పలు చిన్న ఆలయాల్లో అతను దొంగతనాలకు పాల్పడ్డాడని గుర్తించారు. గోవిందరాజస్వామి గుడిలో దొంగతనం తరువాత, అతను తమిళనాడుకు పారిపోగా, ఈ విషయాన్ని గుర్తించిన పోలీసు బృందాలు, అక్కడికి వెళ్లి, అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతన్ని ప్రత్యేక బృందం విచారిస్తూ, ఈ కేసు వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అన్న విషయాన్ని తెలుసుకుంటోంది.
Go Back to Shorts
Tirumala
Tirupati
Theft
Tamilnadu

More Telugu News