తెలంగాణలో ముగిసిన పంచాయతీ సమరం... తుది ఫలితాలు!

  • 7,731 చోట్ల టీఆర్ఎస్ విజయం 
  • గులాబీ ఖాతాలో 61 శాతం పంచాయతీలు
  • 2,698 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారుల విజయం
తెలంగాణలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతుదారులు మొత్తం 7,731 స్థానాల్లో విజయం సాధించి, 61 శాతం పంచాయతీల్లో జయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ మద్దతుదారులు 2,698 స్థానాల్లో విజయం సాధించి, 22 శాతం సర్పంచ్ సీట్లలో పాగావేశారు. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం సత్తా చాటుతూ 14 శాతం గ్రామాలను కైవసం చేసుకుని 1,825 గ్రామాల్లో సర్పంచ్ పదవులను అందుకున్నారు. ఇతర పార్టీల విషయానికి వస్తే, బీజేపీ 163, టీడీపీ 82, సీపీఎం 77, సీపీఐ 50 చోట్ల విజయం సాధించింది. మూడో విడత జరిగిన ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్ పదవులకు పోటీ పడిన వందలాది మంది ఒకటి నుంచి 10 ఓట్ల తేడాతో ఓడిపోవడం గమనార్హం.
Go Back to Shorts
TRS
Panchayat
Telangana

More Telugu News