శంషాబాద్‌ విమానాశ్రయంలో నిలిచిపోయిన తిరుపతి వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌ విమానం

  • సాంకేతిక లోపమే కారణం
  • రెండు ఇంజన్లలో పనిచేయని ఒక ఇంజన్‌
  • విమానంలో టీటీడీ జెఈఓ శ్రీనివాసరాజు
తిరుపతి వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌ విమానం హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో  నిలిచిపోయింది. విమానంలోని రెండు ఇంజిన్లలో ఒకటి పనిచేయక పోవడంతో ఈరోజు తెల్లవారు జామున బయలు దేరాల్సిన విమానాన్ని శంషాబాద్ లో నిలిపివేశారు. సాంకేతిక లోపం కారణంగా విమానం ఎగిరే పరిస్థితి లేదని సంస్థ అధికారులు ప్రకటించడంతో ప్రయాణికులు నిరాశ చెందారు. విమానంలో తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో శ్రీనివాసరాజు తదితర ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.
Go Back to Shorts
spicejet
samshabad
Tirupati

More Telugu News