సబ్ కలెక్టర్, పెనమలూరు ఎమ్మెల్యే మధ్య సమసిన వివాదం

  • ప్రొక్లెయినర్ ని స్వాధీనం చేసుకున్న ఘటన
  • ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తెచ్చిన ఎమ్మెల్యే
  • రైతుల తరపున జరిమానా చెల్లించిన బోడె ప్రసాద్
విజయవాడ సబ్ కలెక్టర్ మిషాసింగ్, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ల మధ్య వివాదం సమసింది. రైతుల తరపున రూ.లక్ష జరిమానాను బోడె ప్రసాద్ చెల్లించారు. కాగా, వణుకూరులో మట్టి అక్రమ తవ్వకాలపై ప్రొక్లెయినర్ ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. రైతుల తరపున ఎమ్మెల్యే జరిమానా చెల్లించడంతో ఈ వివాదానికి తెరపడినట్టయింది.

కాగా, ఓ రైతుకు చెందిన ప్రొక్లెయినర్ ను స్వాధీనం చేసుకుని, భారీ జరిమానా విధించిన సంఘటనలో మిషా సింగ్ వ్యవహారశైలిపై సీఎం చంద్రబాబుకి  బోడె ప్రసాద్ ఈరోజు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Vijayawada
penamaluru
vanukuru

More Telugu News