'కథానాయకుడు' తొలిరోజు వసూళ్ల అంచనా 30 కోట్లు

  • 2017 సంక్రాంతికి వచ్చిన 'శాతకర్ణి'
  • 2018 సంక్రాంతికి వచ్చిన 'జై సింహా'
  • ఈ సంక్రాంతికి విడుదలైన 'కథానాయకుడు'
ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి భాగంగా రూపొందిన 'కథానాయకుడు' ఈ రోజున భారీ స్థాయిలో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా 1100 స్క్రీన్స్ లో ఈ సినిమా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోనే 600 స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ అయింది. ఇంతటి భారీస్థాయిలో బాలకృష్ణ సినిమా రిలీజ్ కావడం ఆయన కెరియర్లో ఇదే మొదటిసారి. మొదటి నుంచి కూడా ఈ సినిమాపై భారీ క్రేజ్ వుంది.

ఆ క్రేజ్ ఏ స్థాయిలో ఉందనేది అడ్వాన్స్ బుకింగ్స్ చాటిచెప్పాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున ఈ సినిమా 30 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టే అవకాశం వుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సంక్రాంతి బరిలో దిగిన ప్రతిసారి బాలయ్యకి కలిసొచ్చింది. 2017 సంక్రాంతికి 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాతోను .. 2018 సంక్రాంతికి 'జై సింహా'తోను ఆయన విజయాలను అందుకున్నారు. ఇక ఈ సంక్రాంతికి కూడా ఆయన జయకేతనం ఎగరేస్తే హ్యాట్రిక్ హిట్ ఆయన ఖాతాలోకి చేరుతుంది. 
Go Back to Shorts
balakrishna
rakul
nithya
raana

More Telugu News