అల్లు శిరీశ్ మూవీ నుంచి ఫస్టులుక్ వచ్చేస్తోంది

  • అల్లు శిరీశ్ హీరోగా 'ఏబీసీడీ'
  • మలయాళ చిత్రానికి రీమేక్
  • దర్శకుడిగా సంజీవ్ రెడ్డి         
ఏ తరహా కథను ఎంచుకోవాలి? ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వెళ్లాలి? అనే ఆలోచనతో అల్లు శిరీశ్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. చివరికి ఆయన మలయాళంలో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న 'ఏబీసీడీ' తెలుగు రీమేక్ లో చేయాలని నిర్ణయించుకున్నాడు. మధుర శ్రీధర్ రెడ్డి .. యష్ రంగినేని నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాకి నిర్మాత సురేశ్ బాబు సమర్పకుడిగా వ్యవహరించనున్నారనే విషయాన్ని అల్లు శిరీశ్ స్వయంగా తెలియజేశాడు. రేపు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకి ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను .. మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలారు. మలయాళంలో చేసిన దుల్కర్ సల్మాన్ కి ఈ సినిమా మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తోన్న అల్లు శిరీశ్ కి ఈ సినిమా ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి. 
Go Back to Shorts
allu sirish

More Telugu News