అప్పులవాళ్లు రాళ్లపల్లి ఇంట్లోని సోఫాలు పట్టుకెళ్లారు: తనికెళ్ల భరణి
- రాళ్లపల్లి ఇంట్లో ఉండేవాడిని
- నాటకాలంటే ఆయనకి పిచ్చి
- గుప్తదానాలు ఎక్కువగా చేసేవారు
నటుడిగా .. కవిగా .. దర్శకుడిగా తనికెళ్ల భరణి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి భరణి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటుడు రాళ్లపల్లి గురించి ప్రస్తావించారు. "రాళ్లపల్లి గారు నాటకాలు వేసేటప్పుడు వాళ్ల ఇంట్లోనే ఉండేవాడిని. రాళ్లపల్లి గారికి నాటకాలు అంటే ప్రేమ .. పిచ్చి. ఈ కారణంగానే ఆయన అప్పుల్లో కూరుకుపోయారు. ఒక నాటకానికి 1000 రూపాయలు వస్తే, అందుకోసం ఆయన 5000 ఖర్చు చేసేవారు.
ఒకసారి నేను రిహార్సల్స్ చేసి బయటికి వస్తుండగా, ఆయనకి అప్పు ఇచ్చిన కొందరు ఆయన ఇంట్లోని సోఫాలు పట్టుకెళ్లిపోతూ కనిపించారు. ఆ తరువాత మా టీమ్ అంతా కలిసి ఆయన కుటుంబానికి అండగా నిలబడి ఆయనని చెన్నైకి పంపించాం. సినిమాల్లోకి వచ్చాక కూడా ఎంతో మందికి గుప్తదానాలు చేశారు. ఒకసారి ఒక షూటింగులో జూనియర్ ఆర్టిస్టులు చలికి వణుకుతుంటే, తన పారితోషికం ముందుగా అడిగి తీసుకుని 100 శాలువలు తీసుకొచ్చి వాళ్లందరికీ పంచారు. అంతటి మంచి మనసున్నవారాయన" అంటూ చెప్పుకొచ్చారు.
ఒకసారి నేను రిహార్సల్స్ చేసి బయటికి వస్తుండగా, ఆయనకి అప్పు ఇచ్చిన కొందరు ఆయన ఇంట్లోని సోఫాలు పట్టుకెళ్లిపోతూ కనిపించారు. ఆ తరువాత మా టీమ్ అంతా కలిసి ఆయన కుటుంబానికి అండగా నిలబడి ఆయనని చెన్నైకి పంపించాం. సినిమాల్లోకి వచ్చాక కూడా ఎంతో మందికి గుప్తదానాలు చేశారు. ఒకసారి ఒక షూటింగులో జూనియర్ ఆర్టిస్టులు చలికి వణుకుతుంటే, తన పారితోషికం ముందుగా అడిగి తీసుకుని 100 శాలువలు తీసుకొచ్చి వాళ్లందరికీ పంచారు. అంతటి మంచి మనసున్నవారాయన" అంటూ చెప్పుకొచ్చారు.