రాజస్థాన్ లో తొలి ట్రెండ్స్... కాంగ్రెస్ కు ఆధిక్యం!

  • రాజస్థాన్ లో 200 అసెంబ్లీ సెగ్మెంట్లు
  • ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
  • ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టం
రాజస్థాన్ లోని 200 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కాసేపటి క్రితం ప్రారంభం అయింది. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించగా, ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం మేరకు అధికార బీజేపీతో పోలిస్తే, కాంగ్రెస్ కు అధిక పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. అన్ని జాతీయ చానల్స్, సర్వే సంస్థలు రాజస్థాన్ లో అధికారాన్ని బీజేపీ కోల్పోనుందని, వసుంధరా రాజే సీఎంగా రాజీనామా చేయాల్సిందేనని, ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉందని పేర్కొన్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Rajasthan
Counting
Elections

More Telugu News