పోలింగ్‌ కేంద్రాల పరిశీలనకు వచ్చిన సబితా ఇంద్రారెడ్డి...అడ్డుకున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతలు

  • పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
  • ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నారని మాజీ మంత్రి ఆరోపణ
  • మహా కూటమి గెలుపు ఆపలేరని స్పష్టీకరణ
ఓటమి భయంతో అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఎన్ని కుట్రలు చేసినా మహాకూటమి విజయాన్ని ఆపలేరని కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేసేందుకు వచ్చిన ఆమెను టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆమె పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లేందుకు వీలులేదంటూ అడ్డంపడ్డారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్‌, బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని, వారెన్ని చేసినా మహాకూటమి విజయాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించు కోవాలని సూచించారు.
Go Back to Shorts
maheswaram
sabhitha indrareddy

More Telugu News