చంద్రబాబును కలిసిన నందమూరి హరికృష్ణ కుమార్తె.. కూకట్ పల్లి టికెట్ ఖరారైనట్టే!

  • పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న నందమూరి మూడో తరం నేత
  • సాయంత్రం కూకట్ పల్లి నేతలతో సమావేశం
  • అనంతరం అధికారికంగా సుహాసిని పేరు ప్రకటన
దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి కూకట్ పల్లి టీడీపీ టికెట్ దాదాపు ఖరారైంది. ఈరోజు ఆమె విశాఖపట్నంలోని నొవోటెల్ హోటల్ లో టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఈ సాయంత్రం కూకట్ పల్లి నేతలతో సమావేశం అనంతరం... ఆమె పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, నందమూరి కుటుంబం నుంచి మూడో తరం నేత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సుహాసినికి టీడీపీ టికెట్ ఇస్తున్న నేపథ్యంలో, కూకట్ పల్లి రాజకీయాలు వేడెక్కాయి.
Go Back to Shorts
nandamuri
suhasini
harikrishna
daughter
Telugudesam
ticket
kukatpalli

More Telugu News